దేశంలో ప్రతీయేటా వచ్చే వరదలకు కారణాలివే...
ABN , First Publish Date - 2022-07-17T17:35:13+05:30 IST
దేశంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి.
దేశంలోని పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. దేశంలోని ప్రతీయేటా సంభవిస్తున్న వరదలకు గల మూడు ప్రధాన కారణాలను నిపుణులు తెలిపారు. వీటిలో మొదటి కారణం రుతుపవనాల అసాధారణ మార్పు. ఐఐటీ గౌహతి తన అధ్యయనంలో రుతుపవనాలకు ముందుగానే భారతదేశంలో అధిక వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. గతంలో వర్షాకాలంలో మాత్రమే వరద ముప్పు ఏర్పడేది. ఆ ప్రమాదం ఇప్పుడు వర్షాకాలానికి ముందుగానే వస్తోంది. రుతుపవనాలు రాకముందే భారీ వర్షాలతో అనేక రాష్ట్రాల్లో వరద తాకిడి పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
దీనికి వాతావరణ మార్పు కారణంగా నిలుస్తోంది. రెండవ కారణం వర్షపు స్వభావం మారడం. కేవలం ఒకటి, రెండు లేదా మూడు రోజుల్లో భారీ వర్షాలు కురవడం. ఫలితంగా నదుల నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి వరదలను నియంత్రించడం కష్టంగా మారుతోంది. ఒక నెల మొత్తంలో కురిసే వర్షపాతం ఒకట్రెండు రోజుల్లో కురిస్తే, దాన్ని తట్టుకునే వ్యవస్థ మన దగ్గర లేదు. దేశంలోని పలు నగరాల్లో డ్రైనేజీ వ్యవస్థలు దశాబ్దాల క్రితం నాటివి. ముంబైలోని డ్రైనేజీ వ్యవస్థ 150 ఏళ్ల పురాతనమైనది. ఢిల్లీ డ్రైనేజీ వ్యవస్థ 1976 నాటిది. చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం మరో కారణం. నదుల నీటిమట్టం పెరిగి, పల్లపు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది.