పశు సంపద వృద్ధికి పశు గణాభివృద్ధి సంస్థ కృషి

ABN , First Publish Date - 2022-08-14T06:10:16+05:30 IST

మేలు జాతి ఆవుదూడల వృద్ధికి పశుగణాభివృద్ధి సంస్థ తగిన చర్యలు చేపడుతోందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీఎల్‌డీఏ చైర్మన మోతె పిచ్చిరెడ్డి తెలిపారు.

పశు సంపద వృద్ధికి పశు గణాభివృద్ధి సంస్థ కృషి



వలిగొండ, అగస్టు 13: మేలు జాతి ఆవుదూడల వృద్ధికి పశుగణాభివృద్ధి సంస్థ తగిన చర్యలు చేపడుతోందని ఉమ్మడి నల్లగొండ జిల్లా డీఎల్‌డీఏ చైర్మన మోతె పిచ్చిరెడ్డి తెలిపారు. శనివారం మండలంలోని వెల్వర్తి గ్రామంలో ఉచిత పశువైద్య శిబిరం, పాడి రైతుల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిచ్చిరెడ్డి మాట్లాడుతూ జిల్లా పశుగణాభివృద్ది సంస్థ  ద్వారా వీర్యనాలికలను విడదీసి వీర్యాన్ని ఎదకు వచ్చిన పశువుకు కృత్రిమ గర్భాధారణ చేయడం వల్ల మేలు రకం ఆడ దూడలు జన్మించే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  సమావేశంలో ఎంపీపీ నూతి రమే్‌షరాజు, ఎంపీటీసీ ఎడవెల్లి సత్తమ్మ యాదయ్య, ఈవో మల్లిఖార్జున, పాల సంఘం చర్మన బూడిద పాపయ్య, వెటర్నరి డాక్టర్లు రామ్మోహనరెడ్డి,  సంధ్య, ఆయా గ్రామాల పాల సంఘం చైర్మన్లు, సూపర్‌వైజర్లు రైతులు పాల్గొన్నారు.  

 

Updated Date - 2022-08-14T06:10:16+05:30 IST