మతాన్ని కించపరిచినందుకు సజీవ దహనం

ABN , First Publish Date - 2021-12-04T06:44:05+05:30 IST

మతాన్ని కించపరిచారనే నెపంతో శ్రీలంక జాతీయుడిని పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో సజీవ దహనం చేశారు....

మతాన్ని కించపరిచినందుకు సజీవ దహనం

పాకిస్థాన్‌లో శ్రీలంక జాతీయుడిపై దారుణం

లాహోర్‌, డిసెంబరు 3: మతాన్ని కించపరిచారనే నెపంతో శ్రీలంక జాతీయుడిని పాకిస్థాన్‌లోని పంజాబ్‌ రాష్ట్రంలో సజీవ దహనం చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీలంకకు చెందిన ప్రయాంత కుమార (40) సియాల్‌కోట్‌ జిల్లాలోని ఓ ఫ్యాక్టరీలో జనరల్‌ మేనేజర్‌గా పని చేస్తున్నారు. ఆయన తహ్రీక్‌-ఎ-లబ్బాయిక్‌ పాకిస్థాన్‌(టీఎల్‌పీ) అనే సంస్థకు చెందిన ఓ పోస్టర్‌ను చించి డస్ట్‌బిన్‌లో పడేశారు. ఆ పోస్టర్‌లో ఖురాన్‌కు చెందిన సూక్తులు ఉండటంతో వందలాది మంది టీఎల్‌పీ కార్యకర్తలు ప్రయాంత కుమారను బయటకు ఈడ్చుకొచ్చి విచక్షణా రహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆయనపై కిరోసిన్‌ చల్లి నిప్పు అంటించారు.  

Updated Date - 2021-12-04T06:44:05+05:30 IST