కేసీ కెనాల్‌లో దూకి విద్యార్థిని ఆత్మహత్య

ABN , First Publish Date - 2021-10-22T05:30:00+05:30 IST

మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన నీళ్లపాల వెంకటసులోచన (16) అనే విద్యార్థిని సమీప కేసీ కెనాల్‌లో పడి ఆత్మహత్య చేసుకుంది.

కేసీ కెనాల్‌లో దూకి విద్యార్థిని ఆత్మహత్య
మృతి చెందిన వెంకటసులోచన(ఫైల్‌)

చెన్నూరు, అక్టోబరు 22: మండలంలోని గోపవరం గ్రామానికి చెందిన నీళ్లపాల వెంకటసులోచన (16) అనే విద్యార్థిని సమీప కేసీ కెనాల్‌లో పడి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు ఎస్‌ఐ శ్రీనివాసులరెడ్డికి ఇచ్చిన ఫిర్యాదు మేరకు... మృతురాలు ప్రొద్దుటూరులోని ఎస్‌ఆర్‌ఐటీ పాలిటెక్నిక్‌ కళాశాలలో డిప్లమా చదువుతోంది. ఈ నెల 21న కళాశాల నుంచి ఇంటికి వచ్చి తల్లిదండ్రులతో డిప్లమా కోర్సు చేయ డం తనకు ఇబ్బందికరంగా ఉందని చెప్పింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చి.. కష్టపడి చదువు కుంటే మంచి భవిష్యత్‌ ఉంటుందని చెప్పారు. అయితే మానసికంగా ఇబ్బంది పడుతున్న ఆ విద్యార్థిని శుక్రవారం ఉదయం నిద్రలేచిన వెంటనే బహిర్భూమికి అంటూ గ్రామం పక్కనే ఉన్న కేసీ కెనాల్‌ వద్దకు వెళ్లింది. ఆ తరువాత ఇంటికి రాకపోవడంతో ఆ విద్యార్థిని తల్లిదండ్రులు వెతుకులాడినా కనిపించలేదు. సాయంత్రం కెనాల్‌లోని ఓ తూము వద్ద అమ్మాయి మృతదేహం బయటపడింది. ఈ మేరకు తల్లిదండ్రులు పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - 2021-10-22T05:30:00+05:30 IST