‘కాకతీయనగర్‌’ దాడి ఘటనలో 14 మందిపై కేసు

ABN , First Publish Date - 2021-05-15T06:08:02+05:30 IST

‘కాకతీయనగర్‌’ దాడి ఘటనలో 14 మందిపై కేసు

‘కాకతీయనగర్‌’ దాడి  ఘటనలో 14 మందిపై కేసు

నర్సంపేట టౌన్‌, మే 14 : వరంగల్‌రూరల్‌ జిల్లా నర్సంపేట పట్టణం నెక్కొండరోడ్‌లోని కాకతీయనగర్‌లో గుడిసెవాసులపై గురువారం దాడికి పాల్పడిన ఘటనలో 14మందిపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు  చేసినట్లు ఎస్సై నవీన్‌కుమార్‌ శుక్రవారం తెలిపారు. కాకతీయనగర్‌కు చెందిన బైరబోయిన వెంకటయ్య, బాలకృష్ణ, విజయ్‌కుమార్‌, రాంప్రసాద్‌, హింద విజయరామరాజు, సదానందం, దాడెం సంతోష్‌, గూళ్ల సంతోష్‌, తొగరు కిరణ్‌, పిన్నింట్‌ బుచ్చయ్య, ఠాకూర్‌ రాజేష్‌, రాయపురం కుమార్‌, సారయ్య, పులిచేరు సారయ్యలు తమపై దాడి చేసి కొట్టడంతో పాటు కులం పేరుతో దూషించినట్లు సీపీఎం పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్‌, బాధితులు చేసిన ఫిర్యాదు మేరకుపై 14 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరితోపాటు దాడిలో పాల్గొని పరారైన వారిని గుర్తించే పనిలో ఉన్నామని ఎస్సై నవీన్‌కుమార్‌ వివరించారు.


Updated Date - 2021-05-15T06:08:02+05:30 IST