రాజన్నపై కేసులు ఎత్తివేయాలి: ప్రజా సంఘాలు
ABN , First Publish Date - 2022-08-10T10:14:25+05:30 IST
అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధపడుతున్న సీపీఐ(ఎంఎల్)జనశక్తి నాయకుడు కూర రాజన్నపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని
హైదరాబాద్, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధపడుతున్న సీపీఐ(ఎంఎల్)జనశక్తి నాయకుడు కూర రాజన్నపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజాసంఘాల నేతలు ప్రొఫెసర్ హరగోపాల్, కోదండరామ్, పీఎల్ విశ్వేశ్వర్రావు, చక్రధర్రావు, మాధవరావు, కె. నాగయ్య, పాశం యాదగిరి, గడ్డం లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజన్న ప్రమేయం లేని కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్పై 1న హైదరాబాద్లో సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విప్లవ కార్యకర్తలు, ప్రజాసంఘాలపై అక్రమ కేసులు గతంలో మాదిరిగానే కొనసాగుతుండటం విచారకరమని ఆందోళన వ్యక్తంచేశారు.