ఎంపీ, మీడియాపై కేసులను ఎత్తేయాలి: రామకృష్ణ
ABN , First Publish Date - 2021-05-17T09:27:53+05:30 IST
‘‘కరోనాతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే సీఎం జగన్మోహన్రెడ్డి కక్షపూరిత విధానాలు అవలంభిస్తున్నారు. తక్షణమే రఘురామకృష్టరాజుపైన,
అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): ‘‘కరోనాతో రాష్ట్రమంతా అతలాకుతలమవుతుంటే సీఎం జగన్మోహన్రెడ్డి కక్షపూరిత విధానాలు అవలంభిస్తున్నారు. తక్షణమే రఘురామకృష్టరాజుపైన, మీడియా సంస్థలపైన పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. ’’ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ హెచ్చరించారు. ఆదివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఏబీఎన్, టీవీ5 చానళ్లపై, మీడియా సంస్థలపై కూడా కేసులు పెట్టారని, కక్షపూరిత విధానాలు అవలంభించడానికి ఇది సరైన సమయం కాదన్నారు.