బాల్యవివాహాలపై కేసులు నమోదు చేయాలి

ABN , First Publish Date - 2021-02-27T04:36:21+05:30 IST

బాల్యవివాహాలపై కేసులు నమోదు చేయాలి

బాల్యవివాహాలపై కేసులు నమోదు చేయాలి

వికారాబాద్‌ : జిల్లాలో జరిగిన బాల్య వివాహాలపై కేసులు నమోదు చేయాలని సీడబ్ల్యూసీ చైర్మన్‌ వెంకటేష్‌ అన్నారు. వికారాబాద్‌ పట్టణంలోని సాకేత్‌నగర్‌లోని బాలరక్షణ భవన్‌లో శుక్రవారం సీడీపీవోలు, సూపర్‌వైజర్లకు బాల్యవివాహ నిర్మూలన, బాల్య వివాహ నిషేధ అధికారుల పాత్రపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1098కి వచ్చిన సమాచారం ప్రకారం జిల్లాలో 2020  ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు 175 బాల్యవివాహాలు చేయడానికి ప్రయత్నించగా వాటిని అధికారుల సహాయంతో అడ్డుకున్నప్పటికీ కొన్ని వివాహాలు రహస్యంగా చేసినట్లు తెలిపారు. వాటిని పరిశీలించి  సీడీపీవోలు, సూపర్‌వైజర్లు కేసులు నమోదు చేయాలని అన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో లలితకుమారి, బీఆర్బీ కోఆర్డినేటర్‌ శ్రీలక్ష్మి, సీడబ్ల్యూసీ సభ్యులు సంగమేశ్వర్‌, చైల్డ్‌లైన్‌ శ్రీనివాస్‌, సీడీపీవోలు ప్రియదర్శిని, కాంతారావు, అనిల్‌, సఖికేంద్రం, సూపర్‌వైజర్లు సునీత, జ్యోతి, సుశీల, పార్వతమ్మ, మణిమాల తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-02-27T04:36:21+05:30 IST