నిందితులను తప్పించేందుకే అచ్చెన్నాయుడిపై కేసులు : కందికుంట
ABN , First Publish Date - 2020-09-22T07:59:43+05:30 IST
ఈఎస్ఐ కుంభకోనం కేసులో అసలు నిందితులు అయిన మంత్రి గుమ్మనూరు జయరాం అతడి కుమారుడు ఈశ్వర్ను తప్పించి, కేసు
కదిరిఅర్బన్, సెప్టెంబరు 21 : ఈఎస్ఐ కుంభకోనం కేసులో అసలు నిందితులు అయిన మంత్రి గుమ్మనూరు జయరాం అతడి కుమారుడు ఈశ్వర్ను తప్పించి, కేసును పక్కదారి పట్టించడానికే టీడీపీ బీసీ నేత అచ్చెన్నాయుడు పై తప్పుడు కేసులు పెట్టి అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ కదిరి నియోజకవర్గ ఇన్చార్జ్ కందికుంట వెంకటప్రసాద్ సోమవారం ఓ ప్రకటనలో ఆరోపించారు.
శాసన సభలో వైసీపీ చేస్తున్న అవినీతి, అక్రమాల పై ప్రశ్నిస్తున్న టీడీపీ నాయకులను కట్టడి చేయాలన్న దురుద్దేశ్యంతో వారిపై అక్ర మ కేసులు బనాయిస్తున్నారన్నారు. మంత్రి కుమారుడు ఈశ్వర్ పుట్టిన రోజున ఖరీదైన బెంజ్కారును విజయవాడలో మెడికల్ ఏజ న్సీ నిర్వహించే ఈఎస్ఐ 14 వ ము ద్దాయిగా ఉన్న తెలకపల్లి కార్తీక్ నుంచి బహుమతి రూపంలో తీసుకున్నది వాస్తవం కాదాఅన్నారు. దీని పై సీబీఐ విచారణ చేపట్టి అసలు దోషులను ప్రజల ముందు బహిర్గతం చేయాలని ఆ ప్రకటనలో డిమాండ్ చేశారు.