వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-10-02T09:01:28+05:30 IST

అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి కనిపించకుండాపోయిన సంఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీసులు ..

వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు

రావులపాలెం రూరల్‌, అక్టోబరు 1: అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి ఇంటి నుంచి బయటకు వచ్చి తిరిగి కనిపించకుండాపోయిన సంఘటనపై వచ్చిన ఫిర్యాదు మేరకు రావులపాలెం పోలీసులు కేసునమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఖండవిల్లికి చెందిన శిరగం గోపాలకృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నాడు.


సెప్టెంబరు 30వ తేదీ రాత్రి ఇంటి నుంచి బయటకు వచ్చాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు అతని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గోపాలపురం వశిష్ఠ వంతెనవద్ద గోపాలకృష్ణకు చెందిన ద్విచక్రవాహనం, చెప్పులు కనిపించినా అతని ఆచూకీ లభించకపోవడంతో అతని సోదరుడు వెంకటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు గురువారం కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.బుజ్జిబాబు తెలిపారు. 

Updated Date - 2020-10-02T09:01:28+05:30 IST