కట్నం కోసం వేధిస్తున్న భర్తపై కేసు నమోదు
ABN , First Publish Date - 2021-07-25T04:47:33+05:30 IST
కడప నగరం కాగితాలపెంటకు చెందిన షేక్ సవియాను ఆమె భర్త మహ్మద్ఖాన్ తరచూ అధిక కట్నం కోసం వేధిస్తుండడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తాలుకా ఎస్ఐ హుసేన్ తెలిపారు.
కడప (క్రైం), జూలై 24: కడప నగరం కాగితాలపెంటకు చెందిన షేక్ సవియాను ఆమె భర్త మహ్మద్ఖాన్ తరచూ అధిక కట్నం కోసం వేధిస్తుండడంతో భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసినట్లు తాలుకా ఎస్ఐ హుసేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు కాగితాలపెంటకు చెందిన మహ్మద్ఖాన్ అదే ప్రాంతానికి చెందిన షేక్ సవియాను 2017లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. గత కొన్ని నెలల నుంచి అధిక కట్నం కోసం ఆమెను వేధిస్తుండడంతో భర్తపై వేధింపుల కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు.
యువకుడిపై చీటింగ్ కేసు నమోదు
ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటూ ఓ యువతిని మోసగించిన యువకుడిపై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు తాలుకా ఎస్ఐ హుసేన్ తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు రవీంద్రనగర్కు చెందిన ఓ యువతి, ముస్తాక్ఆలీ ఏడాదిన్నర నుంచి ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలంటూ యువతి కోరడంతో అతను నిరాకరిస్తూ వస్తుండగా ఆ యువతి ఆరా తీయడంతో మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిసింది. తనను ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఆ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతడిపై చీటింగ్ కేసు పెట్టినట్లు తెలిపారు.