గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై కేసు నమోదు
ABN , First Publish Date - 2020-09-18T21:16:13+05:30 IST
జిల్లాలోని గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు...
పశ్చిమ గోదావరి: జిల్లాలోని గోపాలపురం వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబర్లో ద్వారకాతిరుమల మండలం మాలసానికుంటకు చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ తన ఇంటిపై దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పుడు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో ఆమె హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఎమ్మెల్యే వెంకట్రావుతో పాటు మరో 12 మందిపై ద్వారకాతిరుమల పీఎస్లో ఐపీసీ 448, 506, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.