అనుమానాస్పద మృతిగా కేసు

ABN , First Publish Date - 2021-07-25T06:07:18+05:30 IST

ఓ వ్యక్తి మృతిపై అతని కుమారుడు ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు.

అనుమానాస్పద మృతిగా కేసు

చిత్తూరు, జూలై 24: ఓ వ్యక్తి మృతిపై అతని కుమారుడు ఫిర్యాదు మేరకు రెండో పట్టణ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదు చేశారు. వివరాలిలా.. చంద్రగిరి మండలం అరిగెలవారిపల్లెకు చెందిన వాసు(55)భార్య, పిల్లలతో కలిసి చిత్తూరు శ్రీనగర్‌కాలనీలో నివాసముంటున్నారు. ఈ నెల 19వ తేదీన వాసు మృతి చెందాడు. దాంతో భర్త మృతి చెందిన విషయాన్ని కుమారుడు వినయ్‌, బావకు తెలియజేసి అంబులెన్స్‌లో వాసు మృతదేహాన్ని స్వగ్రామమైన అరిగెలవారిపల్లెకు తీసుకెళ్లింది. అయితే తన తండ్రి మరణంపై అనుమానాలున్నాయని కుమారుడు చంద్రగిరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో వారు అనుమానాస్పద కేసుగా నమోదు చేసి చిత్తూరుకు బదిలీ చేశారు. ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు చిత్తూరు రెండో పట్టణ సీఐ యుగంధర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-25T06:07:18+05:30 IST