ఇద్దరి మధ్య ఘర్షణ.. కేసు నమోదు

ABN , First Publish Date - 2021-05-12T07:21:42+05:30 IST

మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ సమయంలో ఒక వ్యక్తి మరోవ్యక్తిపై గోళ్లు కట్‌ చేసే కత్తితో దాడి చేశాడు.

ఇద్దరి మధ్య ఘర్షణ.. కేసు నమోదు

సింగరాయకొండ, మే 11 : మోటారు సైకిళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది. ఈ సమయంలో ఒక వ్యక్తి మరోవ్యక్తిపై గోళ్లు కట్‌ చేసే కత్తితో దాడి చేశాడు. దీనిపై  కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని పాకలలో అబేడ్కర్‌నగర్‌కు చెందిన పులగర మహేష్‌ పంచాయతీ కార్యాలయం వద్ద నీటిని పట్టుకొని వెళ్తున్నాడు. అదేసమయంలో క్రాంతినగర్‌కు చెందిన కాటంగారి రాఘవులు మామిడితోటలో పని పూర్తి చేసుకొని ఇంటికి బయల్దేరాడు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం, ఘర్షణ చోటుచేసుకుంది. ఆ సమయంలో మహేష్‌ తన ద్విచక్ర వాహనంలో ఉన్న గోళ్లు కత్తిరించుకునే కత్తితో తనపై దాడిచేసినట్లు రాఘవులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ట్రైనీ ఎస్సై మల్లవరపు సువర్ణ కేసును దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-05-12T07:21:42+05:30 IST