గూగుల్‌ సీఈవో పిచాయ్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2022-01-27T08:11:26+05:30 IST

గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేని వ్యక్తులు తన సినిమా ‘ఎక్‌ హసీనా థి.. ఏక్‌ దివానా థా’ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడానికి గూగుల్‌ అనుమతించిందని ఆరోపిస్తూ..

గూగుల్‌ సీఈవో పిచాయ్‌పై కేసు నమోదు

 

ముంబై, జనవరి 26: గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌పై ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేని వ్యక్తులు తన సినిమా ‘ఎక్‌ హసీనా థి.. ఏక్‌ దివానా థా’ను యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేయడానికి గూగుల్‌ అనుమతించిందని ఆరోపిస్తూ సినీ నిర్మాత సునీల్‌ దర్శన్‌ కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో కాపీరైట్‌ చట్ట ఉల్లంఘన కింద సుందర్‌ పిచాయ్‌తో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - 2022-01-27T08:11:26+05:30 IST