రేషన్‌ బియ్యం పట్టివేత

ABN , First Publish Date - 2021-05-15T06:52:28+05:30 IST

అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు.

రేషన్‌ బియ్యం  పట్టివేత

టి.నరసాపురం, మే 14 : అక్రమంగా పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కె.రామకృష్ణ తెలిపారు. తిరుమలదేవిపేట గ్రామానికి చెందిన కూరపాటి వెంకట నరసింహ ప్రసాద్‌ తన నివాసం వద్ద  అను మతి లేకుండా 400 కేజీలు పీడీఎస్‌ బియ్యాన్ని నిల్వ ఉంచాడన్న సమాచారంతో శుక్రవారం దాడి చేసి బియ్యాన్ని స్వాధీనం చేసుకుని   కేసు నమోదు చేసినట్టు  తెలిపారు. 


Updated Date - 2021-05-15T06:52:28+05:30 IST