వ్యక్తిపై దాడి.. నలుగురిపై కేసు
ABN , First Publish Date - 2021-04-16T06:26:34+05:30 IST
మరకట్టు గ్రామంలో రంగస్వామి అనే వ్యక్తిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆలూరు, ఏప్రిల్ 15: మరకట్టు గ్రామంలో రంగస్వామి అనే వ్యక్తిపై దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం ఉదయం గ్రామంలో హోటల్ వద్ద ఈ గొడవ చోటు చేసుకుంది. బాధితుడు రంగస్వామి ఫిర్యాదు మేరకు నాగరాజుతోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఆలూరు ఎస్ఐ రామానుజులు తెలిపారు.