వైసీపీ నేత, వలంటీర్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-06-07T08:15:08+05:30 IST

జి.కోడూరుకు చెందిన వైసీపీ నాయకుడు వెలగా వెంకటరమణ, గ్రామ వలంటీర్‌ పిళ్లా శ్రీనివాసరావులపై శనివారం కేసు

వైసీపీ నేత, వలంటీర్‌పై కేసు నమోదు

మాకవరపాలెం : జి.కోడూరుకు చెందిన వైసీపీ నాయకుడు వెలగా వెంకటరమణ, గ్రామ వలంటీర్‌ పిళ్లా శ్రీనివాసరావులపై శనివారం కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ కరక రాము తెలిపారు. ఈ నెల 3న వీఆర్‌వో శ్రీనివాస్‌ రెవెన్యూ కార్యాలయంలో ఇళ్ల పట్టాల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తుండగా, వీరిరువురూ కొంత మందితో వెళ్లి ఈ జాబితాలో మరికొన్ని పేర్లు చేర్చాలని, పేర్లు చేర్చకపోతే గ్రామంలో ఇంటికి ఎలా వెళతావో చూస్తామని బెదిరించినట్టు  వీఆర్‌వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వెంకటరమణ, శ్రీనివాసరావులపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - 2020-06-07T08:15:08+05:30 IST