లిఫ్ట్ ఇచ్చి.. ఆపై అత్యాచారం
ABN , First Publish Date - 2021-01-14T06:29:18+05:30 IST
లిఫ్ట్ ఇచ్చి.. ఆపై అత్యాచారం
గన్నవరం, జనవరి 13: వివాహితపై అత్యాచారం చేసిన ఇద్దరిపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన మంగళవారం జరిగింది. బల్లిపర్రుకు చెందిన వివాహితకు అమ్మ ఒడి నగదు బ్యాంక్ ఖాతాలో పడ్డాయి. చిన్న కుమారుడిని తీసుకుని వీరపనేనిగూడెంలోని బ్యాంకుకు వచ్చారు. అక్కడి నుంచి ఇంటికి వెళుతుండగా కుమారుడిని బైక్ లిఫ్ట్ అడిగి పంపించింది. ఆమె నడుచుకుంటూ వెళుతుండగా తెంపల్లికి చెందిన కె. నాగరాజు, శ్రీనివాసరావు వెళుతున్నారు. ఆమె వారిని లిఫ్ట్ అడిగింది. వారు బైక్పై ఎక్కించుకుని బల్లిపర్రుకు తీసు కెళ్లకుండా పోలవరం కట్ట వైపు జున్నుగడ్డి పొలంలోకి తీసుకెళ్లి అత్యా చారం చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏసీపీ విజయపాల్, సీఐ కె.శివాజీ, ఎస్సై శ్రీనివాసరావు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు.