వైద్యులను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-05-13T13:10:41+05:30 IST

కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బెదిరించేందుకు ప్రయత్నించిన

వైద్యులను బెదిరించిన వ్యక్తిపై కేసు నమోదు

హైదరాబాద్/మంగళ్‌హాట్‌ : కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను బెదిరించేందుకు ప్రయత్నించిన వ్యక్తిపై నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేశారు. డబీర్‌పురా ప్రాంతంలో నివాసం ఉండే తస్లీన్‌ అనే వ్యక్తి నేషనల్‌ క్రైం ఇన్వెస్టిగేషన్‌ డివిజన్‌ అనే పేరుతో ఆర్గనైజేషన్‌ నడుపుతున్నాడు. ఇటీవల కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిలో ఆక్సిజన్‌ అందక ఐదుగురు చనిపోయారని, తనకు పూర్తి సమాచారంతోపాటు వివరణ కావాలని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌, మరో డాక్టర్‌తో వాగ్వాదానికి దిగాడు. అక్కడున్న వైద్యులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో నారాయణగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు బుధవారం అతడిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. 

Updated Date - 2021-05-13T13:10:41+05:30 IST