ముగ్గురు డాక్టర్లపై కేసు నమోదు

ABN , First Publish Date - 2020-04-09T10:19:46+05:30 IST

నందిగామ మండలం చేగూరుకు చెందిన మాణిక్యమ్మ ఏప్రిల్‌ 1న సాయంత్రం 6.50కి ఉస్మానియా

ముగ్గురు డాక్టర్లపై కేసు నమోదు

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : నందిగామ మండలం చేగూరుకు చెందిన మాణిక్యమ్మ ఏప్రిల్‌ 1న సాయంత్రం 6.50కి ఉస్మానియా ఆసుపత్రిలో మృతి చెందింది. ఎప్రిల్‌ 3న ఆమెకు కరోనాతో చనిపోయినట్లు నిర్ధారించారు. ఆమెకు వైద్యం చేసిన ముగ్గురు డాక్టర్లపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్వరాజ్యలక్ష్మి బుధవారం నందిగామ పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చేగూరులోని ఆర్‌ఎంపీ డాక్టర్‌ ప్రతాప్‌రెడ్డి, షాద్‌నగర్‌లోని శ్రీనివాస్‌ డెంటల్‌ క్లినిక్‌ డా.విఠలయ్య, మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన డా.అనిల్‌పై ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు ముగ్గురి డాక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. చేగూరు, షాద్‌నగర్‌లోని ప్రైవేట్‌ క్లినిక్‌లను పర్మినెంట్‌గా లాక్‌ చేయగా, మహబూబ్‌నగర్‌ జిల్లా అనిల్‌ సర్జికేర్‌ ఆసుపత్రిని సీజ్‌ చేసినట్లు జిల్లా వైద్యాధికారి స్వరాజ్యలక్ష్మి తెలిపారు. డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. 

Updated Date - 2020-04-09T10:19:46+05:30 IST