చెట్లను తొలగించినవారిపై కేసు

ABN , First Publish Date - 2021-05-11T07:19:51+05:30 IST

ఇతరుల భూమిలో చెట్లను తొలగించిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

చెట్లను తొలగించినవారిపై కేసు

అనుమతిలేకుంగా పొలంలోకి ప్రవేశం

చిట్యాల రూరల్‌, మే 10: ఇతరుల భూమిలో చెట్లను తొలగించిన పలువురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చిట్యాల ఏఎస్‌ఐ కె.జోజి తెలిపిన వివరాల ప్రకారం..  నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని ఉరుమడ్లకు చెందిన పల్లపు ఇస్తారికి భూమిలో ఉన్న వేప, తాటి చెట్లను  ఉప్పల స్వామి, సామ యాదిరెడ్డితో పాటు పలువురు అకా రణంగా ఎక్స్‌కవేటర్‌తో  తొలగించారు. భూయజజమాని  పల్లపు ఇస్తారి ఫిర్యాదు మేరకు పలువురిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు. 


Updated Date - 2021-05-11T07:19:51+05:30 IST