లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. పలువురిపై కేసు

ABN , First Publish Date - 2020-05-26T05:30:00+05:30 IST

లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. పలువురిపై కేసు

షాద్‌నగర్‌: లాక్‌డౌన్‌ ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు. ఆదివారం రాత్రి ఆంక్షలు విధించిన ఈశ్వర్‌ కాలనీకి కారులో వెళ్లిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. అలాగే ప్యారడైజ్‌ కాలనీలో రంజాన్‌ సందర్భంగా చీరలు పంపిణీ చేసిన సయ్యద్‌ ఇబ్రహీంపై కేసు నమోదు చేశామన్నారు. సోషల్‌ మీడియాలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వ్యక్తులపై అనుచితంగా కామెంట్లు పోస్ట్‌ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేశారు. మాస్కులు ధరించని 82మందిపై కూడా కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-05-26T05:30:00+05:30 IST