హైదరాబాద్‌లో కంగనా రనౌత్‌పై కేసు నమోదు

ABN , First Publish Date - 2021-11-14T01:27:58+05:30 IST

రెండు రోజుల క్రితం ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కంగనాపై కేసు నమోదు చేశారు..

హైదరాబాద్‌లో కంగనా రనౌత్‌పై కేసు నమోదు

హైదరాబాద్: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్‌పై హైదరాబాద్‌లోని నారాయణగూడ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. దేశస్వాతంత్ర్యం గురించి అవమానకరంగా మాట్లాడారంటూ కంగనాపై తెలంగాణ శివసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుదర్శన్ ఈ కేసు నమోదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘1947లో మనకు వచ్చింది భిక్ష మాత్రమే. 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని కంగనా అంటున్నారు. ఒక భారతీయురాలు అయ్యుండి ఇలా మాట్లాడటం ఏంటి? కంగనా పిచ్చి కూతలు మానుకోవాలి. ఆమెను వెంటనే అరెస్ట్ చేయాలి. ఇమెకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలి’’ అని డిమాండ్ చేశారు.


రెండు రోజుల క్రితం ఓ జాతీయ మీడియా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. కాగా, వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. దేశంలోని అనేక ప్రాంతాల్లో కంగనాపై కేసు నమోదు చేశారు. ఆమెను అరెస్ట్ చేయాలని, పద్మశ్రీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Updated Date - 2021-11-14T01:27:58+05:30 IST