దాడి ఘటనలో ఇద్దరిపై కేసు
ABN , First Publish Date - 2021-01-18T05:12:16+05:30 IST
ఆమదాలవలస గ్రామానికి చెందిన డోల శేఖర్పై ఆదివారం దాడి చేసిన ఘటనలో అదే గ్రామానికి చెందిన వెంకటరమణ, ప్రభాకర్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపారు.
రేగిడి : ఆమదాలవలస గ్రామానికి చెందిన డోల శేఖర్పై ఆదివారం దాడి చేసిన ఘటనలో అదే గ్రామానికి చెందిన వెంకటరమణ, ప్రభాకర్పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ షేక్ మహమ్మద్ ఆలీ తెలిపారు. ఒక పెళ్లి విషయంలో తలెత్తిన వివాదం కొట్లాటకు దారితీసిందని, ఈ క్రమంలో శేఖర్ గాయపడగా... చికిత్స నిమిత్తం రాజాం ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు.