యువతిని వేధిస్తున్న వ్యక్తిపై కేసు
ABN , First Publish Date - 2021-01-24T04:01:14+05:30 IST
డిగ్రీ చదువుతున్న ఓ యువతి వేధిస్తున్న వ్యక్తిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మహబూబ్నగర్, జనవరి 23: డిగ్రీ చదువుతున్న ఓ యువతి వేధిస్తున్న వ్యక్తిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితురాలి వివరాల ప్రకారం పట్టణంలోని బండమీదిపల్లి కి చెందిన ఓ యువతి డిగ్రీ చదువుతోంది. కొద్దిరోజులుగా అదేకాలనీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు వెంటపడి వేధిస్తున్నాడు. అమ్మాయి తల్లిదండ్రులు పలుమార్లు యువ కుడికి చెప్పి నా మార్పు రాలేదు. శనివారం ఉదయం ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్న యువతి వెంట పడ్డా డు. తన వెంట ఎందుకు పడుతున్నావని అడిగితే అసభ్యంగా ప్రవర్తించాడు. ఇంతలో బాధిత యువతి కుటుంబ సభ్యులు అక్కడికిరాగా వారిపైనా చేయి చేసుకున్నాడు. బాధితురాలు రూ రల్ పోలీస్స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.