హెచ్ఎంపాడు జడ్పీటీసీ సభ్యుడిపై కేసు
ABN , First Publish Date - 2022-01-22T05:31:55+05:30 IST
హనుమంతునిపాడు మండల అధికార పార్టీ జడ్పీటీసీ దద్దాల నారాయణయాదవ్పై కనిగిరి పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది.
పదేళ్ల క్రితం స్థలం అగ్రిమెంట్ చేసుకొని కొనుగోలు చేయకపోవడంపై యజమాని ఫిర్యాదు
ఎమ్మెల్యేను విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టిన కొద్దిరోజుల్లోనే కేసుపై అనుమానాలు
కనిగిరి, జనవరి 21: హనుమంతునిపాడు మండల అధికార పార్టీ జడ్పీటీసీ దద్దాల నారాయణయాదవ్పై కనిగిరి పోలీసు స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఎస్ఐ రామిరెడ్డి కథనం ప్రకారం.. పట్టణంలోని పామూరు రోడ్డులో పెట్రోల్ బంకు వెనుక స్థలాన్ని పదేళ్ల క్రితం కొనుగోలు చేసేందుకు జడ్పీటీసీ అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ స్థలాన్ని ఏళ్లు గడుస్తున్నా రిజిస్ర్ష్టేషన్ చేయించుకోవడం లేదు. సంబంధిత స్థల యజమాని ఫిర్యాదు మేరకు చీటింగ్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అయితే అఽధికారపార్టీకి చెందిన జడ్పీటీసీ సభ్యుడు నారాయణయాదవ్.. ఎమ్మెల్యే మధుసూదన్యాదవ్ను విమర్శిస్తూ ఇటీవల సోషల్ మీడియాలో విడుదల చేసిన పోస్టు హల్చల్ చేసింది. దీంతో ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే జడ్పీటీసీపై కేసు నమోదుకై స్థల యజమానిపై, పోలీసులపై ఒత్తిడి తెచ్చినట్లు జోరుగా చర్చ నడుస్తోంది.