కార్వీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

ABN , First Publish Date - 2022-01-27T20:44:28+05:30 IST

కార్వీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిని

కార్వీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

హైదరాబాద్‌: కార్వీ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వచ్చాయి. కార్వీ ఎండీ పార్థసారథి, చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ కృష్ణ హరిని ఈనెల 30 వరకు ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ రూ.2,873 కోట్ల మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. గతేడాది సెప్టెంబర్‌లోనే కార్వీ ఉద్యోగుల స్టేట్మెంట్‌లు ఈడీ రికార్డ్ చేసింది. ఎండీ పార్థసారథి, కృష్ణ హరిలను ప్రధాన నిందితులుగా ఈడీ గుర్తించింది. కార్వీ గ్రూప్ నుంచి 14 షెల్ కంపెనీలకు నగదు బదిలీ అయినట్లు గుర్తించారు. నిధులను దారి మళ్లించడానికి ఫైనాన్స్ కన్సల్టెంట్లు.. పని చేయని ఎన్‌బీఎఫ్‌సీలను కార్వీ ఉపయోగించింది. కస్టమర్ల షేర్‌లను తాకట్టు పెట్టి 5 షెల్ కంపెనీల పేరుతో.. రూ.400 కోట్లు రుణాలు పొందినట్లు నిర్ధారించారు. పార్థసారథికి చెందిన 700 కోట్ల షేర్ హోల్డింగ్‌ ఈడీ అధికారులు సీజ్ చేశారు. రూ. 2 వేల కోట్లకు సంబంధించిన వసూళ్లపై ఈడీ దర్యాప్తు చేస్తోంది.

Updated Date - 2022-01-27T20:44:28+05:30 IST