కార్లు, ద్విచక్ర వాహనాలపై థర్డ్ పార్టీ ప్రీమియం పెంపు
ABN , First Publish Date - 2020-03-06T06:25:52+05:30 IST
కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాలపై ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి థర్డ్ పార్టీ ప్రీమియం పెరిగే ఆస్కా రం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో..
న్యూఢిల్లీ : కార్లు, ద్విచక్ర వాహనాలు, రవాణా వాహనాలపై ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి థర్డ్ పార్టీ ప్రీమియం పెరిగే ఆస్కా రం ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరంలో వాహనాలపై థర్డ్ పార్టీ ప్రీమియం పెంపు ను ప్రతిపాదిస్తూ ఐఆర్డీఏఐ గతంలో చేసిన సిఫారసు చేస్తూ ప్రతిపాదిత రేట్లతో ముసాయిదాను కూడా విడుదల చేసింది. ఈ ముసాయిదాపై అన్ని వర్గాల నుంచి కామెంట్లు కోరింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ ప్రతిపాదిత ప్రీమియంలు అమలులోకి రానున్నాయి. అలాగే విద్యుత్ కార్లపై కూడా ప్రీమియం పెంపును కూడా ప్రతిపాదించింది. అదే విధం గా బస్సులు, లారీలు, ట్రక్కులు అన్నింటి పైనా ప్రీమి యం పెంపు ఆ ప్రతిపాదనల్లో ఉంది.
వాహనం సామర్థ్యం ప్రస్తుత ప్రతిపాదిత
ప్రీమియం ప్రీమియం
1000 సీసీ లోపు కార్లు రూ. 2,072 రూ. 2,182
1000-1500 సీసీ కార్లు రూ. 3,221 రూ. 3,383
1500 సీసీ పైన రూ. 7,890 మార్పు లేదు
75 సీసీ లోపు టూవీలర్లు రూ. 482 రూ. 506
350 సీసీ పైన రూ. 2,323 రూ. 2,571
విద్యుత్ వాహనాలు
30 కిలోవాట్లు లోపు కార్లు రూ.4,493 రూ.5,167
3 కిలోవాట్లు మించని టూవీలర్లు రూ.888 రూ.1,040