వాహన వేగ నియంత్రణ చర్యలు చేపడతాం: ఏఎస్పీ

ABN , First Publish Date - 2022-01-20T06:13:18+05:30 IST

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన వేగ నియంత్రణ చర్యలు చేపడతామని ఏఎస్పీ రితిరాజ్‌ తెలిపారు.

వాహన వేగ నియంత్రణ చర్యలు చేపడతాం: ఏఎస్పీ
నేరేడుచర్లలో విలేకరులతో మాట్లాడుతున్న ఏఎస్పీ రితిరాజ్‌

నేరేడుచర్ల, జనవరి 19 : రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన వేగ నియంత్రణ చర్యలు చేపడతామని ఏఎస్పీ రితిరాజ్‌ తెలిపారు. నేరేడుచర్ల పోలీ్‌సస్టేషన్‌ను బుధవారం ఆమె సందర్శించిన సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు. మితిమీరిన వేగంతో నడిపే వారిని గుర్తించి, కేసులు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినైనా ఉపేక్షించేది లేదన్నారు. దొంగతనాల నివారణకు రాత్రి సమయాల్లో పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామన్నారు. నేరేడుచర్లలో ప్రధాన రహదారి మరమ్మతులో భాగంగా సీసీ కెమెరాలు తొలగించారని, పనులు పూర్తి కాగానే తిరిగి పునరుద్ధరిస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే స్థలాలు గుర్తించి అక్కడ స్పీడు నియంత్రణకు సంబంధించిన చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం రికార్డులు పరిశీలించి, పోలీ్‌సస్టేషన్‌ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-20T06:13:18+05:30 IST