అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2020-08-07T10:37:52+05:30 IST
కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లోవరాజు అన్నారు. గురువారం మండలంలో అప్పయ్యపేట, లక్ష్మీపురం, తదితర గ్రామాల్లో..
సీతానగరం, ఆగస్టు 6 : కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలని ఎస్ఐ లోవరాజు అన్నారు. గురువారం మండలంలో అప్పయ్యపేట, లక్ష్మీపురం, తదితర గ్రామాల్లో కరోనాపై ఆయన అవగాహన కల్పించారు. ఓ గ్రామానికి హైదరాబాద్ నుంచి ఒక కుటుంబం రావడంతో గొడవలకు దారితీశాయి. విషయం తెలుసుకున్న ఎస్ఐ ఆ గ్రామానికి చేరుకొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.