కరోనా సర్వే...

ABN , First Publish Date - 2020-05-29T22:09:01+05:30 IST

రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సర్వెలైన్స్‌ సర్వే నిర్వహించనుంది.

కరోనా సర్వే...

హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత రెండు రోజులుగా వందకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో అత్యధికం హైదరాబాద్‌లోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కరోనా కేసులపై భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) సర్వెలైన్స్‌ సర్వే నిర్వహించనుంది.


హైదరాబాద్‌లోని ఐదు కంటైన్మెంట్‌ జోన్లలో రెండు రోజుల పాటు జాతీయ పౌష్టికాహార సంస్థ టీమ్స్‌ అధ్వర్యంలో శనివారం నుంచి ఈ సర్వే చేపట్టనుంది. నగరంలోని ఆదిభట్ల, బాలాపూర్‌, మియాపూర్‌, చందానగర్‌, టప్పా చబుత్రా కంటైన్మెంట్ జోన్లలో సర్వెలైన్స్ సర్వే నిర్వహించనున్నారు. ఇప్పటికే ప్రతి జోన్‌కు రెండు చొప్పున పది ప్రత్యేక టీమ్‌ల ద్వారా సర్వేకు ఏర్పాట్లు  చేశారు.


ఈ ఐదు కంటైన్మెంట్‌ జోన్లలో కరోనా కేసులు, వాటి పరిస్థితి, లక్షణాలపై ఇంటింటా సర్వే నిర్వహిస్తారు. అనంతరం హైదరాబాద్‌లో పెరుగుతున్న కేసులు, లక్షణాలు లేనటువంటి కేసులపై ఐసీఎంఆర్‌ పూర్తిస్థాయి నివేదిక తయారుచేయనుంది. ఆ నివేదికను కేంద్ర వైద్యఆరోగ్యశాఖకు సమర్పిస్తారు.


గతంలో తెలంగాణలోని జనగామ, కామారెడ్డి, నల్గొండ జిల్లాల్లో ఇప్పటికే సర్వే జరిపారు. సీఎంఆర్  నివేదికల ఆధారంగానే లాక్‌డౌన్‌ పొడిగింపుపై కేంద్రం నిర్ణయం తీసుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేపట్టారు. నివేదిక ఆధారంగా లాక్‌డౌన్ పొడిగింపుపై నిర్ణయం తీసుకోనుంది కేంద్ర ప్రభుత్వం.

Updated Date - 2020-05-29T22:09:01+05:30 IST