దేశంలో సెకండ్ వేవ్‌లో తీవ్రస్థాయి ప్రభావం చూపిస్తున్న కరోనా

ABN , First Publish Date - 2021-05-12T17:50:18+05:30 IST

కేంద్రం లాక్ డౌన్ ప్రకటించలేదు. కానీ మెజారిటీ రాష్ట్రాలు లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయాయి.

దేశంలో సెకండ్ వేవ్‌లో తీవ్రస్థాయి ప్రభావం చూపిస్తున్న కరోనా

హైదరాబాద్: కేంద్రం లాక్ డౌన్ ప్రకటించలేదు. కానీ మెజారిటీ రాష్ట్రాలు లాక్ డౌన్‌లోకి వెళ్లిపోయాయి. ఇప్పుడు దాదాపు దేశమంతా లాక్ డౌన్ మాదిరిగా కనిపిస్తోంది. మరోవైపు దక్షిణాది రాష్ట్రం కర్ణాటక కరోనా కేసుల్లో మహారాష్ట్రను మించిపోయింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ప్రభావం చూపిస్తోంది. పాజిటీవ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి. అదే స్థాయిలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నా.. ఏ మాత్రం ఫలితం కనిపించడంలేదు. దీంతో విధిలేక చివరి అస్త్రంగా రాష్ట్రాలు లాక్ డౌన్ విధిస్తున్నాయి. 


లాక్ డౌన్ విధింపుపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ స్పష్టం చేయడంతో రాష్ట్రాలే ఈ నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే 15 రాష్ట్రాల్లో సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తుండగా ఆ జాబితాలో తాజాగా తెలంగాణ కూడా చేరిపోయింది. 10 రోజుల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

Updated Date - 2021-05-12T17:50:18+05:30 IST