నరసాపురంలో నలుగురికి కరోనా నిర్ధారణ

ABN , First Publish Date - 2021-01-27T04:41:36+05:30 IST

పట్టణంలో కరోనా మళ్లీ కలకలం రేపింది. ఐదో వార్డులోని ఆరోగ్యకేంద్రంలో కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పట్టణ నోడల్‌ అధికారి వి.స్వరూప్‌ చెప్పారు.

నరసాపురంలో నలుగురికి కరోనా నిర్ధారణ

నరసాపురం, జనవరి 26: పట్టణంలో కరోనా మళ్లీ కలకలం రేపింది. ఐదో వార్డులోని ఆరోగ్యకేంద్రంలో కరోనా పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పట్టణ నోడల్‌ అధికారి వి.స్వరూప్‌ చెప్పారు. శ్రీహరిపేట, గాంధీ నగర్‌లలో ఒక్కొక్కరికి, రుస్తుంబాద ప్రాంతంలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలిందన్నారు. ఒకేసారి నాలుగు పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో పట్టణ ప్రజలు ఒక్కసా రిగా ఉలిక్కిపడ్డారు. వారిని హోం ఐసొలేషన్‌లో ఉండాలని వైదులు  సూచించారు.

Updated Date - 2021-01-27T04:41:36+05:30 IST