ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా
ABN , First Publish Date - 2022-01-22T06:43:18+05:30 IST
ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా
విస్సన్నపేట, జనవరి 21: మండలంలో ఇద్దరు ఉపాధ్యాయులకు కరోనా సోకినట్టు నిర్ధారణ అయిందని ఎంఈవో సీహెచ్ రామకృష్ణ శుక్రవారం తెలిపారు. కొండపర్వ ఎంపీయూపీ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, మారెమండ ఎంపీయూపీ పాఠశాలలో మరో ఉపాధ్యాయుడికి కరోనా సోకిందని, పుట్రేలలోని ఒక ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్ వచ్చినట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అందరూ కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మండలవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో కరోనా కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. అనేకులు ప్రైవేటుగా ర్యాపిడ్ టెస్టులు చేయించుకోవడంతో, వాస్తవ కేసులు బయటకు రావడం లేదు.