రంగారెడ్డి జిల్లా: ఓ జూనియర్ కళాశాలలో కరోనా కలకలం..
ABN , First Publish Date - 2021-12-29T15:57:49+05:30 IST
రంగారెడ్డి జిల్లా: నార్సింగ్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపింది.
రంగారెడ్డి జిల్లా: నార్సింగ్లోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలలో కరోనా కలకలం రేపింది. 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటీవ్ వచ్చింది. దీంతో తోటి విద్యార్థులు భయాందోళనకు గురౌతున్నారు. గత రెండు రెండు రోజులుగా తీవ్ర చలి, జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు కాలేజీ యాజమాన్యం కరోనా పరీక్షలు చేయించింది. దీంతో 14 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. అప్రమత్తమైన నార్సింగ్ మున్సిపల్ అధికారులు కాలేజీలో శానిటేషన్ చేశారు. మిగతా విద్యార్థులను హోం ఐసోలేషన్లో ఉండాలని సూచించారు.