ఆహారం, ఔషధాలు అందించండి: కాంగ్రెస్
ABN , First Publish Date - 2020-03-27T07:28:55+05:30 IST
లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆహారం, ఔషధాలను అందించాలని పార్టీ కార్యకర్తలను ...
న్యూఢిల్లీ: లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఆహారం, ఔషధాలను అందించాలని పార్టీ కార్యకర్తలను కాంగ్రెస్ పార్టీ కోరింది. ఎంపీలాడ్స్ నిధుల నుంచి కొంత మొత్తాన్ని హాస్పిటళ్లు, ఆరోగ్య కేంద్రాల కోసం అందించాలని పార్టీ ఎంపీలకు సూచించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ లేఖ రాశారు.