భారత్లో కొత్తగా 2,55,874 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-25T15:51:10+05:30 IST
న్యూఢిల్లీ: భారత్ దేశంలో కరోనా మమహ్మరి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది.
న్యూఢిల్లీ: భారత్ దేశంలో కరోనా మమహ్మరి తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. రోజు రోజుకు లక్షల సంఖ్యల్లో కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 2,55,874 కరోనా కేసులు నమోదు కాగా 614 మంది మరణించారు. చికిత్స నుంచి కోలుకుని 2.67 లక్షల మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 22.36 లక్షలకు చేరగా.. రోజువారీ పాజిటివిటి రేటు 15.52 శాతం నమోదయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ అధికారికంగా వెల్లడించింది.