భారత్లో కొత్తగా 27,553 కరోనా కేసులు
ABN , First Publish Date - 2022-01-02T16:40:09+05:30 IST
భారత దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటీవ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి.
న్యూఢిల్లీ: భారత దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. పాజిటీవ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 27,553 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 284 మంది మృతి చెందారు. 9,249 మంది చికిత్స నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,22,801 యాక్టీవ్ కేసులు ఉండగా... ఇప్పటి వరకు కోవిడ్తో 4,81,770 మంది మృతి చెందారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 1,45,44,13,005 మందికి టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో వెల్లడించింది. అయితే కోవిడ్ ఉధృతి దృష్ట్యా ఇప్పటికే పలు రాష్ట్రాల్లో నైట్ కర్ఫ్యూ విధించారు. ఢిల్లీ, మహారాష్ట్రలలో కోవిడ్ విజృంభన కొనసాగుతోంది. అలాగే ఒమైక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.