భారత్‌లో కొత్తగా 14,146 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-10-17T16:37:35+05:30 IST

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా...

భారత్‌లో కొత్తగా 14,146 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 14,146 కరోనా కేసులు నమోదుకాగా.. 144 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,40,67,719కి చేరగా.. 4,52,124  మృతి చెందారు. కరోనా చికిత్స నుంచి 3,34,19,749 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,95,846 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 97.65 కోట్లకుపైగా టీకా పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

Updated Date - 2021-10-17T16:37:35+05:30 IST