భారత్‌లో కొత్తగా 35,178 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-08-18T16:35:45+05:30 IST

దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా ...

భారత్‌లో కొత్తగా 35,178 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 35,178 పొజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 440 మంది మృతి చెందగా.. చికిత్స నుంచి కోలుకుని 37,169 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో మొత్తం ఇప్పటి వరకు కరోనా కేసుల సంఖ్య 3,22,85,857కి చేరింది. 3,14,85,923 మంది రికవరీ కాగా 4,32,519 మృతి చెందారు. ప్రస్తుతం 3,67,415 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కాగా దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 656,06,52,030మంది టీకాలు తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో వెల్లడించింది.

Updated Date - 2021-08-18T16:35:45+05:30 IST