భారత్‌లో కొత్తగా 58,419 కరోనా కేసులు

ABN , First Publish Date - 2021-06-20T15:52:36+05:30 IST

దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది.

భారత్‌లో కొత్తగా 58,419 కరోనా కేసులు

న్యూఢిల్లీ:  దేశ వ్యాప్తంగా కరోనా ఉధృతి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 58,419 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,576 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వరకు పాజిటీవ్ కేసుల సంఖ్య 2,98,81,965కి చేరగా.. 2,87,66,009 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7,29,243 యాక్టీవ్ కేసులుండగా.. ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 3,86,713 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 27,66,93,572 మంది టీకా తీసుకున్నారని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. 75 రోజుల తర్వాత కనిష్ఠానికి రోజువారీ కేసులు చేరుకున్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-06-20T15:52:36+05:30 IST