679 కొత్త కేసులు.. 5 మరణాలు

ABN , First Publish Date - 2021-04-23T06:37:23+05:30 IST

జిల్లాలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది.

679 కొత్త కేసులు.. 5 మరణాలు


ఆంధ్రజ్యోతి-విజయవాడ : జిల్లాలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తోంది. గడచిన 24 గంటల్లో 679 మంది కొత్తగా కరోనా బారినపడగా, మరో ఐదుగురు పాజిటివ్‌ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యఆరోగ్యశాఖ గురువారం విడుదల చేసిన అధికారిక బులెటిన్‌లో పేర్కొంది. ఈ కొత్త కేసులతో కలిపి జిల్లాలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 56,716కు ఎగబాకింది. కొవిడ్‌ మరణాల సంఖ్య 728కి పెరిగింది. ఇంకా 5,262 మంది బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-04-23T06:37:23+05:30 IST