16 మందికి కరోనా
ABN , First Publish Date - 2021-03-03T04:46:59+05:30 IST
ఉమ్మడి పాలమూరులో మంగళవారం 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది.
మహబూబ్నగర్, మార్చి 2 : ఉమ్మడి పాలమూరులో మంగళవారం 16 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. అందులో మహబూబ్నగర్ జిల్లాలో అత్యధి కంగా 13 కేసులు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లాలో ఇద్దరు, నాగర్క ర్నూల్ జిల్లాలో ఒకరు వైరస్ బారిన పడ్డారు. నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో కే సులు నమోదు కాలేదు.