కరోనా కేసులు 29.. ఒకరు మృతి

ABN , First Publish Date - 2020-12-04T06:26:57+05:30 IST

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 29 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు గురువా రం అధికారులు వెల్లడించారు.

కరోనా కేసులు 29.. ఒకరు మృతి

అనంతపురం వైద్యం, డిసెంబరు3: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 29 కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చినట్లు గురువా రం అధికారులు వెల్లడించారు. చికిత్స పొందుతున్న మరో బాధితుడు మరణించాడు. 16 మండలాల్లో కొత్త కేసులు వచ్చాయి. ఇందులో ధర్మవరం 6, పుట్టపర్తి 4, బుక్కపట్నం 3, అనంతపురం, కణేకల్లు, పామిడి 2, 10 మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. జిల్లాలో ఇప్పటి వరు 66772 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 592 మంది మరణించారు. 65947 మంది ఆరోగ్యంగా కోలుకోగా.. ప్రస్తు తం 233 మంది చికిత్స పొందుతున్నారు.


కరోనా మరణాల్లో ఏది వాస్తవం?

జిల్లాలో కరోనా మరణాలపై ఇప్పటికీ వింత నాటకం సాగుతోంది. గురువారం జిల్లా కలెక్టర్‌ కరోనాపై మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమయంలో జిల్లాలో 660 మంది కరోనాతో మరణించినట్లు వెల్లడించారు. ఇదే విషయాన్ని డీపీఆర్‌ఓ కూడా రాసి, పంపించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన బులెటిన్‌లో గురువారం నాటికి జిల్లాలో 592 మంది మరణించినట్లు వెల్లడించారు. ఈ లెక్కన 68 మంది మరణంపై లెక్క లేకపోవటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కలెక్టర్‌ ప్రకటన వాస్తవమా.. రాష్ట్ర శాఖ విడుదల చేసిన బులెటిన్‌ సరియైునదా అన్న సందేహం అందరినీ వెంటాడుతోంది.

Updated Date - 2020-12-04T06:26:57+05:30 IST