ఉమ్మడి జిల్లాలో 317 మందికి కరోనా

ABN , First Publish Date - 2020-12-03T05:07:42+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 317 కేసులు నమోదయ్యాయి.

ఉమ్మడి జిల్లాలో 317 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 317 కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ జిల్లాలో 190 కేసులు నమోద య్యాయి. వికారాబాద్‌ జిల్లాలో 20 కేసులు నమోదయ్యాయి.


ఇబ్రహీంపట్నం డివిజన్‌లో..

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం డివిజన్‌లో బుధవారం 11 కేంద్రాలతోపాటు ఓ మొబైల్‌ వాహనం ద్వారా 361 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. అబ్దుల్లాపూర్‌మెట్‌ 1, హయత్‌నగర్‌ 2, తట్టిఅన్నారం 1, మొబైల్‌ టెస్టులో ఒకరికి పాజిటివ్‌ అని తేలింది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో 166మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఐదుగురు వ్యక్తులు కూడా కేశంపేట మండలానికి చెందిన వారేనని వివరించారు. షాద్‌నగర్‌ పట్టణంతోపాటు ఇతర మండలాల్లో పాజిటివ్‌ కేసులు రాలేదని తెలిపారు.  


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌) : వికారాబాద్‌ జిల్లాలో కరోనా కేసులు పెరిగాయి. బుధవారం వికారాబాద్‌లో 8, పూడూరులో 4, మర్పల్లిలో 2, తాండూరులో 2, కొడంగల్‌లో 2, ధారూరు, పెద్దేముల్‌ మండలాల్లో ఒక్కో పాజిటివ్‌ కేసు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 2941 కరోనా కేసులు నమోదుకాగా, వాటిలో 208 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో 8 మంది ఆసుపత్రుల్లో, 200 మంది హోంకేర్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంత వరకు జిల్లాలో కరోనా నుంచి 2679 మంది కోలుకోగా, 54 మంది మృతి చెందారు.


నాగసమందర్‌లో మహిళకు కరోనా

ధారూరు: మండల పరిధిలోని నాగసమందర్‌లో ఒకరికి కరోనా సోకినట్లు పీహెచ్‌సీ వైద్యా ధికారి రమేశ్‌ తెలిపారు. ఆసుపత్రిలో బుధవారం 36మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా మహిళ(45)కు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు ఆయన చెప్పారు. ఆమె ప్రైమరీ కాంటాక్టు అయిన వారిని, బంధువులను గుర్తించి పరీక్షలు నిర్వహించామని వైద్యాధికారి చెప్పారు.  


మేడ్చల్‌లో..

మేడ్చల్‌ : మేడ్చల్‌ ప్రభుత్వాసుపత్రిలో బుధవారం 35మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు వైద్యురాలు మంజుల తెలిపారు. అదేవిధంగా  శ్రీరంగవరం పీహెచ్‌సీలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఎవరికీ పాజిటివ్‌ రాలేదని వైద్యురాలు నళిని తెలిపారు. 

Updated Date - 2020-12-03T05:07:42+05:30 IST