మరో 680 కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-10-23T11:30:18+05:30 IST

జిల్లాలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతూ ఉంది. గురువారం 680 కేసులు రావడంతో మొత్తం 88,906కి చేరింది.

మరో 680 కరోనా కేసులు

ఏలూరు, అక్టోబరు 22 : జిల్లాలో కరోనా తీవ్రత స్థిరంగా కొనసాగుతూ ఉంది. గురువారం 680 కేసులు రావడంతో మొత్తం 88,906కి చేరింది. ఏలూరులో అత్యఽధికంగా 65 కేసులు, తాడేపల్లిగూడెం లో 52 వెలుగు చూశాయి. పాలకొల్లు 31, భీమవరం 29, ఆచంట 25, చింతలపూడి 25, నరసాపురం 25, గణపవరం 22, తణుకు 22, పెనుమంట్ర 23, వీరవాసరం 20 కేసులు వచ్చాయి. అత్తిలి 18, కాళ్ల 15, లింగపాలెం 15, దెందులూరు 14, యలమంచిలి 14, పెదపాడు 13, పెనుగొండ 13, పెంటపాడు 13, జంగారెడ్డి గూడెం 13, ఆకివీడు 12, కొవ్వూరు 11, ఉండ్రాజవరం 11 మినహా మిగిలిన మండలాల్లో 5 నుంచి 10 లోపు కేసులు నమోదయ్యాయి. గురువారం కరోనా కారణంగా ఒకరు మరణించగా మృతుల సంఖ్య 486కి చేరింది.

Updated Date - 2020-10-23T11:30:18+05:30 IST