భాకరాపేట ఘాట్‌లో లోయలో పడ్డ కారు

ABN , First Publish Date - 2022-07-06T05:55:09+05:30 IST

చంద్రగిరి మండల పరిధిలోని తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిలో భాకరాపేట ఘాట్‌ రోడ్డులో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడింది.

భాకరాపేట ఘాట్‌లో లోయలో పడ్డ కారు
క్షతగాత్రులను 108లో తరలిస్తున్న దృశం

ఆరుగురికి గాయాలు

చంద్రగిరి, జూలై 5: చంద్రగిరి మండల పరిధిలోని తిరుపతి - మదనపల్లె జాతీయ రహదారిలో భాకరాపేట ఘాట్‌ రోడ్డులో మంగళవారం రాత్రి 8.30 గంటల సమయంలో కారు అదుపుతప్పి లోయలో పడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కడప జిల్లా వేంపల్లికి చెందిన మనోజ్ఞకు తిరుపతిలో ఎంసెట్‌ పరీక్ష రాయాల్సి ఉంది. దీంతో ఆమె అత్త శ్రీలక్ష్మి, ఇతర కుటుంబసభ్యులైన భవత్సన, శివకేశవ, సురేష్‌, శ్రీను కారులో తిరుపతికి బయలుదేరారు. భాకరాపేట ఘాట్‌ రోడ్డులోకి రాగానే మలుపు వద్ద కారు అదుపు తప్పి సుమారు 10 అడుగుల లోయలో పడింది. కారులో ప్రయాణిస్తున్న ఆరుగురికీ గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. చంద్రగిరి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2022-07-06T05:55:09+05:30 IST