కారు ఢీకొని ఇద్దరి మృతి
ABN , First Publish Date - 2021-01-16T05:43:48+05:30 IST
కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు చింతూరు పోలీసులు తెలిపారు.
చింతూరు, జనవరి 15: కారును బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్టు చింతూరు పోలీసులు తెలిపారు. చింతూరు మండలం చట్టి గ్రామ సమీపంలో గురువారం ఈ ఘటన జరిగింది. మండలంలోని నరసాపురానికి చెందిన ముచ్చిక రామకృష్ణ (25) మిడియం సీతయ్య (45) చట్టి నుంచి స్వగ్రామమైన నరసాపురం బైక్పై వెళుతుండగా భద్రాచలం వైపు నుంచి తెలంగాణకు చెందిన కారు అటుగా వస్తూ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటనలో రామకృష్ణ, సీతయ్య అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.