HYD : తెల్లవారు జామున దర్జాగా Car లో వచ్చి.. మరో కారును కొట్టేశారు!
ABN , First Publish Date - 2021-11-09T17:07:37+05:30 IST
కారులో దర్జాగా వచ్చి మరో కారును దొంగిలించిన ఘటన
హైదరాబాద్ సిటీ/నాచారం : కారులో దర్జాగా వచ్చి మరో కారును దొంగిలించిన ఘటన నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. బ్యాంకు కాలనీలో నివాసముండే సూర్ణం రాజేష్ అనే వ్యక్తి రోజులాగే కారును ఇంటి సమీపంలో పార్కింగ్ చేశాడు. సోమవారం తెల్లవారు జాము దొంగలు దర్జాగా కారులో వచ్చి ఈ కారును దొంగిలించారని పోలీసులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తులో ఉంది.